/rtv/media/media_files/2025/06/15/IEdVxF28R8AMDc50jlxA.jpg)
గ్రేటర్ హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామున దారుణ చోటుచేసుకుంది. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డు చింతల్కుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడి అక్కడికక్కడే ఇద్దరు సజీవ దహనమయ్యారు. వారితోపాటు ఓ కుక్క కూడా కాలిబూదిదైంది. రోడ్డు పక్కన ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఇద్దరిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులను యాచకులుగా పోలీసులు భావిస్తున్నారు.