Crime News: వీడు తండ్రి కాదు దుర్మార్గుడు.. ప్రియుడితో భార్య వెళ్లిపోయిందని.. ముగ్గురు పిల్లల గొంతు కోసి అతికిరాతంగా..!

తమిళనాడుకు చెందిన వినోద్ భార్య తనని, పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. తిరిగి రమ్మని చెప్పినా రావడానికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం పొందిన ఆ తండ్రి ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా గొంతు కోసం చంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

New Update
Crime

Crime

మారుతున్న జీవనశైలితో పాటు ప్రజలు ఆలోచించే విధానం మారిపోతుంది. కోపంతో ఆ నిమిషానికి ఏం అనిపిస్తే అది చేస్తేస్తున్నారు.. ఆ తర్వాత బాధపడుతున్నారు. కన్న బిడ్డలు అని చూడకుండా అతి కిరాతంగా చంపుతున్నారు. తాజాగా తమిళనాడులోనూ ఇలాంటి దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తంజావూర్ జిల్లా మదుక్కూర్ సమీపంలో గోపాల సముద్రం ప్రాంతానికి చెందిన వినోద్ కుమారు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇతను ఫొటోగ్రాఫర్, డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇది కూడా చూడండి: Hyderabad : ఎల్‌బీనగర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురికి తీవ్రగాయాలు

భార్య తిరిగి రానని చెప్పడంతో..

వినోద్ భార్య నిత్య తిరువారూర్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం చివరకు ప్రేమగా మారింది. దీంతో భర్త, పిల్లలను వదిలేసి ఆరు నెలల కిందట ఆ వ్యక్తితో వెళ్లిపోయింది. అయితే మళ్లీ తిరిగి రావాలని వినోద్ తన భార్యను అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై వినోద్ ముగ్గురు పిల్లలను దారుణంగా గొంతుకోసి చంపేశాడు. స్వీట్లు తినాలని ఇచ్చి.. అవి తింటుండగానే పిల్లలను చంపేసి.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: TG Crime: తెలంగాణలో అమానుషం.. గ్యాంగ్‌ రేప్‌కు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి

Advertisment
తాజా కథనాలు