/rtv/media/media_files/2025/04/15/P4mtS8BVVexUV95tfvZC.jpg)
anusha crime news
విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భర్త జ్ఞానేశ్వర్ ముందునుంచే విశ్వప్రయత్నాలు చేశాడు. గర్భిణీగా ఉండగానే ఓసారి ఫలూదాలో నిద్రమాత్రలు కలిపాడు. అయితే అవి కరగకపోవడంతో ఆమె గుర్తించి అడగ్గా ఏమో తనకు తెలియదంటూ బుకాయించాడు. పెళ్లై రెండేళ్లైనా ఇంట్లో మంచం, కంచాలు తప్ప ఏమీ కొనలేదు. తమ సంబంధం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అనూషతో కూడా ఫొటోలు కూడా ఎక్కువగా తీసుకోలేదు.
కేజీహెచ్ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు జ్ఞానేశ్వర్ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.
2022లో ప్రేమించి పెళ్లి
గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారు. రెండు ఫాస్ట్ఫుడ్ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు. అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని... నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.
Also read : భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!