TG Crime: అనుమానంతో భార్యను ఉరేసి చంపి.. తర్వాత ఏం చేశాడంటే!

సరూర్‌నగర్‌ లో దారుణ ఘటన వెలుగుచూసింది. మరియాదాస్‌ అనే వ్యక్తి తన భార్య అమృతను చున్నీతో ఉరేసి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే అమృత హత్యకు కారణమని తెలుస్తుంది.

New Update
Saroornagar Husband killed wife

Saroornagar Husband killed wife

TG Crime: వివాహేతర సంబంధాల కారణంగా  భర్త భార్యను, భార్య భర్తను   హతమార్చిన  ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి మరో ఘటన వెలుగుచూసింది. భార్య వివాహిత సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను చున్నీతో ఉరేసి చంపాడు భర్త. ఈ దారుణం హైదరాబాద్ లోని సరూర్‌నగర్‌ జరిగింది. 

Also Read: Shalini Pandey: ఉఫ్.. తడిసిన అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

చున్నీతో ఉరేసి

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కొమ్మనపల్లికి చెందిన మరియాదాస్‌, అమృత దంపతులు గత మూడేళ్ళుగా సరూర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే తరచూ వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధాల గురించి గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఇవాళ భార్య అమృత ఫోన్ మాట్లాడుతుండగా.. మరోసారి ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో విచక్షణ కోల్పోయిన మరియదాసు దారుణానికి ఒడిగట్టాడు. భార్యను చున్నీతో ఉరేసి చంపాడు. ఆ తర్వాత నేరుగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు అతడి పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు