బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మర్రిపాడ బైపాస్ దగ్గర వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో బారికేడ్లను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపుగా 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Road Accident
New Update

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీకి దగ్గర అర్ధరాత్రి పూట బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: 'OG' కథ బాబాయ్ కన్నా ముందు నేనే విన్నా.. సినిమా మీ ఊహకే అందదు: వరుణ్ తేజ్

తప్పించబోయి బోల్తా..

ఈ ప్రమాదానికి గురైన బస్సు ఆరెంజ్ ట్రావెల్స్‌కి చెందినదని సమాచారం. మర్రిపాడ బైపాస్ దగ్గర వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్లను తప్పించుకునే క్రమంలో బస్సు బొల్తా పడింది. సుమారుగా 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

ఇది కూడా చూడండి: Cinema: కొరియోగ్రాఫర్ జానీ నేషనల్ అవార్డు రద్దు

#bus-accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe