/rtv/media/media_files/2025/05/21/KPFOOES5S0rfcgwnesLV.jpg)
Nagar Kurnool incident mother killed daughter
TG Crime: కన్న బిడ్డ అనే కనికరం లేకుండా ఏడేళ్ళ కూతురిని గొంతు నులిమి చంపేసింది కసాయి తల్లి. ఆ తర్వాత మృతదేహాన్ని నీటి మడుగులో పడేసింది. ఈ కిరాతకమైన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో జరిగింది.
కన్న కూతురిని
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనే మహిళ తన ఏడేళ్ల కూతురిని గొంతులు నులిమి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని ఇంటి ఆవరణలోని ఓ నీటి గుంతలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. కూతురిని కిరాతకంగా హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తల్లి అనే పదానికే మాయని మచ్చ తెచ్చిందంటూ గ్రామా ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్న్నారు.
కన్న కూతురిని కడతేర్చిన కసాయి తల్లి
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2025
గొంతు నులిమి చంపి, నీటి గుంతలో పడేసి ఏడేళ్ల కూతురిని హత్య చేసిన తల్లి, గతంలో భర్తను కూడా హత్య చేసిన మహిళ
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనే మహిళ గతంలో తన భర్తను హత్య చేయగా, ఇప్పుడు తన కూతురు నందిని… pic.twitter.com/abEKJAJNwj
భర్తను కూడా హత్య
అయితే పోలీసుల విచారణలో మరో షాకింగ్ విషయం బయటపడింది. ఎల్లమ్మకు ఇదేమి మొదటి నేరం కాదు. గతంలో తన భర్తను కూడా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేరం పై కొంతం కాలం జైలు జీవితం కూడా గడిపి.. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చింది. మరి మళ్ళీ ఏమైందో.. కానీ ఆదివారం రాత్రి కూతురిని గొంతు పిసికి చంపేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
telugu-news | latest-news | nagar-kurnool-district
Also Read: Miss World 2025: ప్రపంచ దృష్టి మొత్తం హైదరాబాద్ వైపే.. ఈరోజు మిస్ వరల్డ్ హెడ్ టూ హెడ్ ఛాలెంజ్!