/rtv/media/media_files/2025/04/18/JxRu6bdQiyX4usRIEXS4.jpg)
vizag womens
విశాఖలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మ్యారేజ్ బ్యూరో పేరుతో యువతులకు వల వేసిన కొంతమంది కేటుగాళ్లు.. యువతుల నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఓ యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఓ నిందితుడిపై విశాఖ నాలుగో పట్టణ పీఎస్లో కేసు నమోదైంది. నిందితుడు సుమారు 30 మంది యువతుల వీడియోలు తీసినట్లుగా యువతి ఆరోపిస్తుంది. నిందితుడితో జరిగిన చాటింగ్ను యువతి మొత్తం సోషల్ మీడియాలో పెట్టింది.
విశాఖలో వెలుగులోకి మరో దారుణ ఘటన
— Rahul (@2024YCP) April 18, 2025
మ్యారేజ్ బ్యూరో పేరుతో యువతులకు వల వేసిన కేటుగాళ్లు
మత్తు మందు ఇచ్చి యువతులపై అత్యాచారానికి పాల్పడిన కేటుగాళ్లు
నగ్న వీడియోలు చిత్రీకరించి యువతులను బెదిరించిన కేటుగాళ్లు
పోలీసులకు ఫిర్యాదు చేసినా
పట్టించుకోలేదని బాధితుల ఆవేదన pic.twitter.com/vZ5wTPfaNM
పెళ్లికాని అమ్మాయిల వివరాలు
మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, టూవీలర్ రైడ్ యాప్ పేరిట ఓ ముఠా పెళ్లికాని అమ్మాయిల వివరాలు సేకరించి ఆపై పరిచయం పెంచుకుని ప్రేమ అంటూ వెంటపడి ముగ్గులోకి దింపుతారు. ఆ తరువాత కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి యువతులు స్పృహలో కోల్పోయాక అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీస్తారు. ఆ తరువాత పిలిచినప్పుడు రాకపోతే వీడియోలను పోర్న్ సైట్ లలో పెడుతామని బెదిరించి ప్రతి రోజూ తమ కోరికను తీర్చుకుంటారు.
కామాంధులకు బలై గర్భం
ఈ క్రమంలో ఓ యువతి ఆ కామాంధులకు బలై గర్భం కూడా దాల్చింది. గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్లు చేయిస్తున్నారని వాపోయింది బాధితురాలు. అబార్షన్ చేయించుకోకపోతే సుపారీ ఇచ్చి చంపేయిస్తామని బెదిరిస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించింది. ముందుగా ఈ విషయంపై పోలీసులను ఆశ్రయిస్తే అలా వెళ్లడం తమదే తప్పు అన్నట్లుగా నిందితుల వైపే మాట్లాడుతున్నారని.. దీంతో తాను మీడియాను ఆశ్రయించినట్లుగా బాధితురాలు చెబుతోంది. దీనిపై పోలీసులు ఏం చెబుతారో చూడాలి.
Also Read : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!