అమ్మానాన్న, చెల్లిని గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి.. ఎందుకంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా దిలియా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భూ వివాదం కారణంగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు, సోదరిని గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ట్రిపుల్‌ మర్డర్‌ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

New Update
murder

murder

ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ జిల్లాలో జరిగిన మూడు హత్యల కేసులో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు, సోదరిని గొడ్డలితో నరికి చంపాడు. భూ వివాదం కారణంగా ఈ హత్యలకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకుని స్థానికులు షాక్‌ అయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఆదివారం దిలియా గ్రామంలో దారుణ హత్యలు జరిగాయి. భూ వివాదం కారణంగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు, సోదరిని గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్‌ మర్డర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు. మరోవైపు ట్రిపుల్‌ మర్డర్‌ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

Advertisment
తాజా కథనాలు