Janagon : జనగామలో బోల్తా పడ్డ డీసీఎం.. 16 ఆవులు మృతి!

హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న డీసీఎం వ్యాన్ జనగామ జిల్లాలో బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 16 ఆవులు మరణించగా.. మరికొన్నింటి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

waramngal
New Update

ఆవులతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో బోల్తా పడిన ఘటన ఈ రోజు చోటుచేసుకుంది. ఆవుల లోడ్‌తో హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న డీసీఎం వ్యాన్ ప్రమాదవశాత్తు వావిలాల శివారు మలుపు వద్ద ఈరోజు బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 16 ఆవులు మరణించగా.. మరికొన్ని ఆవుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వ్యాన్ డ్రైవర్ అతివేగంతో ప్రయాణించడం వల్లే బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయపడిన మూగజీవాలను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.  

Also Read: స్కూల్‌ కోసం రెండవ తరగతి విద్యార్థిని బలి ఇచ్చిన యాజమాన్యం!

#janagama-district #warangal #crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి