ప్రాణం తీసిన రిమోట్ పంచాయితీ.. 17 సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయని భర్త.. ఆ భయంతో ఉరేసుకుని..!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దేవిక సూసైడ్‌ కేసులో బిగ్‌ అప్డేట్‌ వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి టీవీ రిమోట్ కోసం భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో శరత్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవిక 17 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మనస్థాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది.

New Update

Hyderabad: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ప్రశాంతిహిల్స్ లోని ఓ అపార్ట్​మెంట్​ లో పెళ్ళైన ఆరునెలలకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దేవిక  ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనంగా మారింది. తాజాగా దేవిక సూసైడ్ కి సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. టీవీ రిమోట్ కోసం భార్య భర్తల మధ్య మొదలైన గొడవ చివరికి ప్రాణాలు తీసినట్లు తెలుస్తోంది. 

రిమోట్ కోసం 

గత కొన్నిరోజులుగా భార్య భర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆదివారం రాత్రి టీవీ రిమోట్ కోసం శరత్, దేవిక మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో శరత్ కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవిక భర్తకు 17 సార్లు ఫోన్ చేసిందట. ఎంతకూ శరత్ ఫోన్ లిఫ్ట్ చేయపోవడంతో  మనస్థాపం చెందిన ఆమె ఫ్యాన్ కి ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. 

అసలేం జరిగిందంటే.. 

వికారాబాద్ జిల్లా తోర్ మామిడికి చెందిన కమలాపురం దేవిక, మంచిర్యాలకు చెందిన సద్గుర్తి సతీశ్ చంద్ర ఒకే సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు (Software Employees) గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇరువైపు కుటుంబాలను ఒప్పించి గతేడాది ఆగస్టు 23న గోవాలో ఘనంగా పెళ్లి  చేసుకున్నారు.

ఆ తర్వాత  రాయదుర్గం పరిధిలోని ప్రశాంతిహిల్స్ లోని ఓ అపార్ట్​మెంట్​ లో కాపురం పెట్టారు. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే భార్య భర్తలిద్దరి మధ్య మస్పర్థలు, గొడవలు మొదలయ్యాయి. ఇలా ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దేవిక, సతీష్ ఇంట్లో గొడవ పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన దేవిక గదిలోకి వెళ్లి  గడియ పెట్టుకుంది. ఆ తర్వాత సతీష్ కూడా బయటకు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల తర్వాత తిరిగి వచ్చాడు. ఇంటికొచ్చిన సతీష్  దేవిక గది తలుపులను పెట్టి ఉంచడంతో .. నిద్రపోయిందనుకొని సతీష్ మరో గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు ఆఫీస్ కి వెళ్లాల్సి ఉండగా, అప్పటికీ తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన సతీష్ తలుపు బద్దలు కొట్టి చూడగా.. దేవిక ఫ్యాన్ కి ఉరేసుకొని కనిపించింది. అనంతరం ఘటన స్థలానికి  చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్త సతీష్ కట్న వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని దేవిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Also Read: Ramayana: షాకింగ్ న్యూస్.. 'రామాయణ' నుంచి ఆ స్టార్ నటి అవుట్.. కారణం ఇదేనా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు