AP News: పేగులో పెరిగిన పిండం.. కోడలి మృతితో పెళ్లి ఇంట విషాదం..!

ఏలురు జిల్లా కోటపాడు గ్రామంలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. చిన్నకుమారుడి వివాహం జరిగిన మరుసటి రోజే ఇంటి పెద్ద కోడలు జ్యోత్స్న మరణించింది. బుధవారం రాత్రి పెళ్లి ఉండగా.. మధ్యాహ్నం కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన జ్యోత్స్న ఆపరేషన్ జరిగిన తెల్లారే చనిపోయింది.

New Update
eluru incident_ married women Jyothsna died with uterus health issue

eluru incident_ married women Jyothsna died with uterus health issue

ఆంద్రప్రదేశ్ లోని ఏలురు జిల్లా చింతలపూడి మండలం కోటపాడు గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సంబరాలతో సందడిగా.. ఉండాల్సిన ఇంటిని .. ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.  ఇంటి పెద్ద కోడలి మరణంతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగింది. 

కడుపు నొప్పితో ఆస్పత్రికి.. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటపాడు గ్రామంలో పామర్తి మారేశ్వరరావు, జ్యోత్స్న దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే ఏప్రిల్ 30 బుధవారం రోజు మహేశ్వరావ్ తమ్ముడు చెన్నారావ్ వివాహం పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు. బుధవారం రాత్రికి ముహూర్తం ఉండగా కుటుంబ అంతా పెళ్లి సందడిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి పెద్ద కోడలు, మారేశ్వరరావు భార్య జ్యోత్నకు హఠాత్తుగా ఆ రోజు మధ్యాహ్నం నుంచి విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. భార్య కడుపు నొప్పితో బాధపడుతుండటంతో మహేశ్వరావు పక్కనే ఉన్న చింతలపూడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 

 పేగులో పెరిగిన పిండం

అక్కడ జ్యోత్సనను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. ఇక అదే రోజు రాత్రి తమ్ముడి వివాహం ఉండడంతో కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించి.. భార్యను ఖమ్మం  జిల్లా  సత్తుపల్లిలోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడ ఆమెకు స్కానింగ్ చేయించారు. 

ఆపరేషన్ జరిగిన తెల్లారే 

అనంతరం రిపోర్ట్స్ పరీక్షించిన వైద్యులు.. జ్యోత్స్న  గర్భం దాల్చిందని.. ఆమె కడుపులో పెరగాల్సిన పిండం పేగులో పెరగడం వల్ల అది పగిలిపోయి రక్తస్రావమైందని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేయాలని వివరించారు. దీంతో భర్త మహేశ్వరరావు వెంటనే 40వేల ఫీజు చెల్లించి భార్యకు ఆపరేషన్ చేయించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆపరేషన్ జరిగిన తెల్లారు గురువారం ఉదయం భర్తతో కాస్త బాగానే మాట్లాడిన జ్యోత్స్న.. ఆ కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది.  పెళ్లి జరిగిన మరుసటి రోజే ఇంట్లో  ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. జ్యోత్స్నకు రెండేళ్ల  పాప కూడా ఉంది. 

ఆపరేషన్ వికటించే

ఆపరేషన్ వికటించే జ్యోత్స్న మృతి చెందిదని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకొని వారికి నచ్చజెప్పారు. అనంతరం ఆపరేషన్ చేసిన సదరు వైద్యులు.. ఇక్కడికి వచ్చే సమయంలోనే  ఆమె పరిస్థితి విషమించిందని.. ఎక్కడికి  వెళ్లినా ఫలితం ఉండదని చెప్పామని తెలిపాడు. ఆ తర్వాత ఆమె భర్త ఆపరేషన్ చేయమంటేనే చేశామని వివరించారు. 

latest-news | crime | ap | eluru-district 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు