/rtv/media/media_files/2025/07/06/serial-killer-ajay-lamba-2025-07-06-19-27-49.jpg)
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ సీరియల్ కిల్లర్ను అరెస్ట్ చేశారు. క్యాబ్ డ్రైవర్లే లక్ష్యంగా 2001లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కాడు. ఢిల్లీకి చెందిన అజయ్ లాంబా 2001లో జరిగిన నలుగురు క్యాబ్ డ్రైవర్ల హత్య కేసులలో నిందితుడిగా ఉన్నాడు. అజయ్ లాంబా మరో ఇద్దరితో కలిసి 2001లో క్యాబ్ డ్రైవర్లే లక్ష్యంగా వరుస హత్యలకు పాల్పడ్డాడు. అతడిపై 4 హత్య కేసులో నమోదయ్యాయి. అజయ్ లాంబా తన ఇద్దరు సహచరులతో కలిసి ఉత్తరాఖండ్కు క్యాబ్ మాట్లాడుకునే వారని, అక్కడ డ్రైవర్ను హత్య చేసి అతడి దగ్గరున్న నగదు, నగలు లాక్కుని, క్యాబ్ను నేపాల్కు తరలించి అమ్ముకునే వారని పోలీసులు తెలిపారు.
#WATCH | Delhi Police Crime Branch arrested a criminal, Ajay Lamba alias Bansi, a proclaimed offender, who had been absconding for the last 25 years. He was wanted in connection with a murder case registered at PS New Ashok Nagar, Delhi.
— ANI (@ANI) July 6, 2025
The accused, a notorious… pic.twitter.com/y0Qf4eFT1B
2008 వరకు అజయ్ ఇక్కడే పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరిగాడు. 2008లో కుటుంబంతో సహా నేపాల్కు వెళ్లి 2018 వరకు అక్కడే ఉన్నాడు. 2018లో భారత్కు వచ్చి మళ్లీ నేరాలు మొదలుపెట్టాడు. 2020లో ఒడిశా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ తర్వాత బెయిల్పై బయటికి వచ్చి 2021లో ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టయ్యాడు. మళ్లీ అరెస్టై మళ్లీ బెయిల్పై వచ్చాడు. 2024లో ఢిల్లీలో జ్యుయెలరీ షాపులో దోపిడీకి పాల్పడ్డాడు. దాంతో పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఇన్నిసార్లు అరెస్టయినా అజయ్ లాంబా 2001లో నలుగురు క్యాబ్ డ్రైవర్లను హత్య చేసిన విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. తాజాగా పోలీసులు అతడే సీరియల్ కిల్లర్ అని గుర్తించారు.