BIG BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్!

కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్రను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే సిక్కిం రాష్ట్రంలోని గాంగ్‌టక్‌ ప్రాంతంలో వీరేంద్రను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్రను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే సిక్కిం రాష్ట్రంలోని గాంగ్‌టక్‌ ప్రాంతంలో వీరేంద్రను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి రూ.12 కోట్ల నగదు, రూ.6 కోట్ల బంగారం, విదేశీ కరెన్సీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై  పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: VP Election: రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి.. ఎవరి బలం ఎంత? మైనస్ లు ఏంటి?

మనీ లాండరింగ్ యాక్ట్ కింద..

వీరేంద్ర బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నారని, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్‌ల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించారని, ఆ డబ్బును అక్రమ మార్గాల్లో తరలించారని ఈడీ ఆరోపిస్తోంది. వీరేంద్ర అరెస్టు సమయంలో ఈడీ అధికారులు ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా దాచిన భారీ మొత్తంలో నగదు, బంగారం, విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు వీరేంద్రకు సంబంధించిన ఇళ్లలో, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో రూ.12 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు రూ.6 కోట్ల విలువైన బంగారాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఈ బంగారం బిస్కెట్ల రూపంలో, ఆభరణాల రూపంలో కూడా ఉంది. వీటితో పాటు పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీ ఏయే దేశాలకు చెందిందో ఇంకా పూర్తి వివరాలు తెలియాలి. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో..

ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరెస్టు కావడం కర్ణాటక రాజకీయాల్లో పెద్ద అలజడి ఏర్పడింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ప్రతిపక్షాలు కూడా ఈ అరెస్టుపై విమర్శలు గుప్పించాయి. అవినీతి, అక్రమాలు చేస్తున్న రాజకీయ నాయకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు రాజకీయంగా పెద్ద వివాదంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈడీ అధికారులు వీరేంద్రను కోర్టులో హాజరుపరిచి, మరింత విచారణ కోసం కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈ కేసు విచారణలో మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ చట్టం కింద అరెస్టయిన వారికి బెయిల్ దొరకడం చాలా కష్టమని తెలుస్తోంది. ఈ కేసులో వీరేంద్ర దోషిగా తేలితే, ఆయనకు తీవ్రమైన శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: YS Sharmila: మా అన్న అసలు రూపం ఇదే.. జగన్‌పై షర్మిల సంచలన ట్వీట్!

Advertisment
తాజా కథనాలు