/rtv/media/media_files/2025/10/31/golla-srilatha-2025-10-31-12-33-25.jpg)
పెళ్లి అయిన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకరమైన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల శ్రీలతకు .. రంగారెడ్డి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు పెద్దలు. అయితే వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరులో ఉంటున్న మేనమామ ఇంటికి భర్తతో కలిసి వచ్చింది శ్రీలత. అక్కడ ఎవరూ లేని టైమ్ లో బాత్రూంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పెళ్లైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య
— RITAM TELUGU (@RitamTelugu1) October 31, 2025
ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఆత్మహత్య చేసుకున్న శ్రీలత అనే యువతి (21)
నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీశైలం(సూరి) అనే యువకుడిని ప్రేమించిన శ్రీలత
3 నెలల క్రితం… pic.twitter.com/pKvtD1AHVf
ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ శ్రీలత చనిపోయింది. కాగా చంద్రవంచకు చెందిన సూరి అనే యువకుడి వేధింపులకే తమ సోదరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరులు ఆరోపిస్తున్నా రు. బలవంతపు పెళ్లి చేయడంతోనే శ్రీలత ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సూరి మోసం చేసినందుకే శ్రీలత చనిపోయిందని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, అది తమ పరిధిలోకి రాదని ఫిర్యాదు కోస్గి పోలీసులు స్వీకరించలేదని తెలుస్తోంది.
కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్
తమ న్యాయం చేయాలని, నిందితుడిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. తాండూర్- మహబూబ్నగర్ జాతీయ రహదారిపై మృతదేహంతో ధర్నాకు దిగారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.
/rtv/media/member_avatars/2025/05/07/2025-05-07t015022634z-vamshi.jpg )
 Follow Us
 Follow Us