/rtv/media/media_files/2025/11/12/ap-police-2025-11-12-11-38-11.jpg)
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన పోలీసులే వాటికి కేంద్రబిందువుగా మారిన సంఘటన గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా పరిధిలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది జూదం ఆడుతూ ప్రత్యేక టాస్క్ఫోర్స్ దాడుల్లో పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో పెదకాకాని పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్సై కొమ్మూరి వెంకట్రావు స్వయంగా జూదం నిర్వాహకుడిగా మారడం గమనార్హం.
ఓ హోటల్లో రహస్యంగా
గుంటూరు-విజయవాడ జాతీయ రహదారి పక్కన, తక్కెళ్లపాడు సమీపంలో ఉన్న ఓ హోటల్లో రహస్యంగా ఈ జూదం స్థావరం నడుపుతున్నట్లుగా నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందం, సుమారు వారం రోజుల కిందట ఈ హోటల్పై ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడుల్లో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. జూదం ఆడుతున్న వారిలో ఏఎస్సై కొమ్మూరి వెంకట్రావుతో పాటు కొందరు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. ఈ సంఘటన జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
Follow Us