ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా పడి 25 మంది!

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్‌ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

New Update
Accident

Accident

Accident: ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్‌ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా క్షతగాత్రులను 108 అంబులెన్సుల్లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మైనర్ బాలురు ఐఫోన్ కోసం ఏకంగా ఓ యువకుడిని అతి దారుణంగా హతమార్చారు. రీల్స్‌ చేద్దామని చెప్పి షాదాబ్‌ అనే యువకుడిని ఊరి చివరకు తీసుకెళ్లి అతడి గొంతు కోసి, బండ రాయితో తలపై కొట్టి కొట్టి హత్య చేశారు. ఆపై బావిలో పడేశారు.

ఇది కూడా చూడండి: Fruits and Milk: ఈ పండ్లు పాలు తాగితే శరీరంలో విషంగా మారుతుందా..? ఇలా జాగ్రత్తలు తీసుకోండి..!!

బెంగళూరుకు చెందిన షాదాబ్‌(19) తన మేనమామ మ్యారేజ్‌కు హాజరయ్యేందుకు ఇటీవల బహరాయిచ్‌లోని నాగౌర్‌ గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలోనే ఇద్దరు మైనర్లు రీల్స్‌ చేద్దామని చెప్పి ఆ షాదాబ్‌ను ఊరి చివర ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అతడి గొంతు కోసి, బండ రాయితో తలపై కొట్టి కొట్టి హత్య చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు