/rtv/media/media_files/2025/11/10/ameenpur-2025-11-10-06-48-48.jpg)
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భార్యను భర్త కొట్టి చంపేశాడు. ఈ దారుణ బఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన చెవుల బ్రహ్మయ్య, క్రిష్ణవేణి (37) దంపతులు కొంతకాలంగా అమీన్పూర్ పట్టణం కేఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. క్రిష్ణవేణి కోహిర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుండగా, బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారిగా బిజినెస్ చేస్తున్నాడు.
క్రికెట్ బ్యాట్తో క్రిష్ణవేణి తలపై
ఈ దంపతులకు ఇంటర్ చదివే అమ్మాయి, ఎనిమిదో తరగతి చదువుతున్న అబ్బాయి ఉన్నారు. అయితే భార్యభర్తలకు ఒకరిపై ఒకరికి అనుమానం ఉంది. ఈ విషయమై ఇద్దరికి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దీంతో కోపంతో బ్రహ్మయ్య.. ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్తో క్రిష్ణవేణి తలపై గట్టిగా కొట్టడంతో క్రిష్ణవేణి అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Follow Us