CPI Narayana: వాళ్లిద్దరి దయతోనే బీజేపీ నడుస్తోంది.. మోదీది ఆర్థిక మాఫియా!

చంద్రబాబు, నితీష్ కుమార్ దయతోనే దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందని సీపీఐ నారాయన అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న నరేంద్ర మోదీ దేశంలో ఆర్థిక మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI Narayana: వాళ్లిద్దరి దయతోనే బీజేపీ నడుస్తోంది.. మోదీది ఆర్థిక మాఫియా!
New Update

CPI Narayana: ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దయతోనే బీజేపీ పార్టీ నడుస్తోందని సీపీఐ నారాయన అన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న నరేంద్ర మోదీ దేశంలో ఆర్థిక మాఫియా నడిపిస్తున్నారని ద్వజమేత్తారు. దేశ ఆదాయం అంబానీ కుటుంబాలకు తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు.

కర్ణాటక మఖ్యమంత్రి సిద్ధరామయ్యపై చేస్తున్న అక్రమ ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని ఆదివారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. అలాగే కోల్ కతా వైద్యురాలి అత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఆ కేసును సీబీఐ విచారణకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం నడుస్తున్న బీజేపీ అండతోనే జగన్ భూదందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కంటే బీజేపీ నాయకులకు కావాల్సిన సకల సదుపాయాలు అందుతున్నాయని, భూ దందాలు, అవినీతి పెరిగిపోయిందని, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

#pm-modi #cpi-narayana #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe