Covid : కోవిడ్ ఎఫెక్ట్... యువతలో గొంతు పక్షవాతం? కొత్త అధ్యయనంలో భయంకరమైన నిజాలు..!!

కోవిడ్ అటాక్ అయిన తర్వాత వోకల్ కార్డ్ పక్షవాతం బారిన పడిన మొదటి పీడియాట్రిక్ కేసును పరిశోధకులు తెలిపారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇది పిల్లలు, పెద్దలలో నాడీ వ్యవస్థ సంబంధిత లేదా నరాల వ్యాధి సమస్యగా మారవచ్చని నిర్ధారించారు.

china: డ్రాగన్ కంట్రీ బాగోతం బట్టబయలు..జీరో కోవిడ్ తర్వాత 2023లో మరో 7లక్షల మరణాలు నమోదు..!!
New Update

కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటివరకు చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారినపడ్డారు ప్రజలు. మునుపటి అధ్యయనాలలో, ఇన్ఫెక్షన్ తర్వాత లాంగ్ కోవిడ్ సమస్యలు శాస్త్రవేత్తల ఆందోళనను పెంచాయి. మరోసారి కరోనా ముప్పు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ఓమిక్రాన్ యొక్క కొత్త సబ్-వేరియంట్ JN.1 వేరియంట్ కారణంగా, చైనా-సింగపూర్, భారతదేశంతో సహా అనేక దేశాలలో సంక్రమణ కేసులు పెరిగాయి. కరోనా అనేక విధాలుగా శారీరక సమస్యలను పెంచుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఇటీవలి అధ్యయనంలో, రుచి, వాసన తర్వాత, కరోనా ఇన్ఫెక్షన్ ఇప్పుడు గొంతు పక్షవాతానికి కారణం అవుతుందని శాస్త్రవేత్తలు నివేదించారు. ఈ రకమైన మొదటి సందర్భంలో, కోవిడ్-19 కారణంగా వోకల్ కార్డ్ పక్షవాతం కేసు నమోదు అయ్యింది. ఈ సమస్య గురించి తెలుసుకుందాం.

అమెరికాలోని మసాచుసెట్స్ ఐ అండ్ ఇయర్ హాస్పిటల్ పరిశోధకులు కరోనా ఇన్‌ఫెక్షన్ వల్ల నాడీ వ్యవస్థకు సంబంధించిన లేదా న్యూరోపతిక్ సమస్యలు కూడా వస్తాయని, ఫలితంగా గొంతు పక్షవాతం వస్తుందని తేల్చి చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది. పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయన నివేదికలో, కరోనా వల్ల కలిగే ఈ తీవ్రమైన సమస్య గురించి శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

ఇన్ఫెక్షన్ తర్వాత గొంతు కోల్పోయిన బాలిక: 

మీడియా నివేదికల ప్రకారం, SARS-CoV-2 వైరస్‌తో ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ అయిన కొద్ది రోజుల తర్వాత, 15 ఏళ్ల అమ్మాయికి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. ఆసుపత్రిలో పరీక్షించినప్పుడు, నాడీ వ్యవస్థపై కోవిడ్ దుష్ప్రభావాల కారణంగా బాలికకు గొంత పక్షవాతం వచ్చినట్లు గుర్తించారు. ఆ అమ్మాయికి అప్పటికే ఆస్తమా వంటి సమస్యలు ఉన్నాయి. ఈ కేసును ఎండోస్కోపిక్ పరీక్షలో బాలిక వాయిస్ బాక్స్ లేదా 'స్వరపేటిక'లో కనిపించే రెండు స్వర తంతువులలో సమస్య ఉన్నట్లు కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు.

COVID-19 ప్రారంభమైనప్పటి నుండి టీనేజ్‌లో గొంత పక్షవాతం యొక్క మొదటి కేసు ఇదేనని పరిశోధకులు తెలిపారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని ప్రొఫెసర్ క్రిస్టోఫర్ హార్ట్నిక్, వైరస్‌తో సంక్రమణ తలనొప్పి, మూర్ఛలు, నరాలవ్యాధితో సహా అనేక రకాల నరాల సంబంధిత సమస్యలతో ముడిపడి ఉందని చెప్పారు. గొంతు పక్షవాతం కరోనావైరస్ యొక్క అదనపు న్యూరోపతిక్ సమస్య కావచ్చునని ఈ కేసు సూచిస్తుంది.

అధ్యయనం ఏం చెబుతోంది?

ఇప్పటికే ఉబ్బసం లేదా నరాల సంబంధిత సమస్యలు ఉన్న రోగులు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది. దీని కోసం, కరోనా ఇన్ఫెక్షన్ చికిత్స సమయంలో వైద్యులు న్యూరాలజీ-సైకియాట్రీ మొదలైన వాటిపై తీవ్రమైన శ్రద్ధ వహించడం ముఖ్యమని పేర్కొంది.గతంలో కూడా కరోనా కారణంగా అనేక రకాల సమస్యలు నమోదయ్యాయి. అందుకే ఇది కేవలం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకే పరిమితమైన వ్యాధి కాదని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి:  ఇంజనీరింగ్ లో టాప్ గ్రూప్ లు ఇవే!

#coronavirus #covid-19 #vocal-cord-paralysis #health #usa #medical-research
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe