Chandrababu : జైల్లోనే చంపే కుట్ర జరుగుతోంది...ఏసీబీ కోర్టుకు చంద్రబాబు సంచలన లేఖ..!!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సంచలన లేఖ రాశారు. తనను జైల్లోనే చంపే కుట్ర జరుగుతోందంటూ లేఖలో పేర్కొన్నారు. ఈనెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టుకు అందించారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను రాశారు చంద్రబాబు.

New Update
AP Politics : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

తనను జైల్లోనే చంపే కుట్ర జరుగుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సంచలన లేఖ రాశారు. ఈనెల 25వ తేదీన రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టుకు అందించారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను రాశారు చంద్రబాబు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందన్న చంద్రబాబు...జైల్లోకి వచ్చిన్నప్పుడు అనధికారికంగా తన ఫొటోలు, వీడియోలు తీశారని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు కావాలనే తన వీడియోలను లీక్ చేశారని చంద్రబాబు ఆరోపించారు.

అధికారపార్టీ తన ఫొటోలు, వీడియోలను వైరల్ చేసిందన్నారు. తన పరువుకు భంగం కలిగించేందుకే ఫోటోలు, వీడియోలు లీక్ చేశారని ఆరోపించారు. తన భద్రతను గాలికి వదిలేసి తన జీవితాన్ని ప్రమాదంలో పడేశారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అంతం చేసేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర చేశారని... దీనిపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందని పేర్కొన్నారు. ఆ లేఖపై ఇప్పటికీ విచారణ చేపట్టలేదని చంద్రబాబు తాను రాసిన లేఖలో వెల్లడించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై మాజీ మంత్రి రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు..

కాగా అటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, అనుబంధ పిటిషన్ల పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ఈ పిటిషన్ పై విచారణ చేశారు. అయితే.. విచారణ సందర్భంగా న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అని అన్నారు. హైకోర్టు సీజే సోమవారం ఈ పిటిషన్ పై విచారణ చేపడతారని న్యాయమూర్తి వెల్లడించారు. సోమవారం కాకుండా వెంటనే విచారణ చేపట్టాలని కోరామని చంద్రబాబు లాయర్లు తెలిపారు. లాయర్ల  విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసు బదిలీ చేశారు న్యాయమూర్తి. ఎవరు విచారణ చేపడతారనే నిర్ణయం రిజిస్ట్రార్ కే వదిలేశారు. 

ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఉప్పు కలిపిన నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుస్తే షాక్ అవుతారు..!!

Advertisment
తాజా కథనాలు