Congress : నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర సభ!

రంగారెడ్డి జాల్లాలోని తుక్కుగూడలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జనజాతర సభగా ఈ భారీ సభకు నామకరణం చేశారు.పార్లమెంట్ ఎన్నికల జాతీయ మ్యానిఫెస్టోను ఈ సభా వేదిక నుంచి రాహుల్‌ గాంధీ విడుదల చేస్తారని పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

New Update
Rahul Gandhi: లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత‌గా రాహుల్ గాంధీ !

Congress Meeting : రంగారెడ్డి జాల్లా(Rangareddy District) లోని తుక్కుగూడలో కాంగ్రెస్‌(Congress) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ నుంచే కాంగ్రెస్‌ పార్లమెంట్ ఎన్నికల భేరీ మోగించనున్నారు. జనజాతర సభగా ఈ భారీ సభకు నామకరణం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) నే స్వయంగా ఈ సభ ను విజయవంతం చేసేందుకు రంగంలోకి దిగారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల జాతీయ మ్యానిఫెస్టోను ఈ సభా వేదిక నుంచి రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)  విడుదల చేస్తారని పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సభకు 10 లక్షల మంది హాజరయ్యేలా కాంగ్రెస్‌ వర్గాలు ప్లాన్‌ చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సెంటిమెంట్‌ తో కేంద్రంలో కూడా తమ జెండాను ఎగరవేసేందుకు కాంగ్రెస్‌ తుక్కుగూడను సెంటిమెంట్ ప్లేస్‌ గా ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

ఈ సభను 70 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ఖర్గే. తెలుగులో మేనిఫెస్టోను విడుదల చేయనున్న నేతలు. గతంలో ఇక్కడే ఆరు గ్యారంటీలను ప్రకటించిన సోనియా గాంధీ. మరోసారి అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్న ఏఐసీసీ.

ఈ సభలో ఏఐసీసీ రూపొందించిన మ్యానిఫెస్టోలో పాంచ్‌ న్యాయ్‌...పచ్చీస్‌ గ్యారంటీ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలు ఇవ్వనున్నట్లు పీసీసీ పేర్కొంది.

Also read:  నేడు , రేపు వడగాలులు వీచే అవకాశాలు… ప్రజలు బయటకు రావొద్దు!

Advertisment
తాజా కథనాలు