TS: కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకం.. కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకమని బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి అన్నారు. ముస్లిం లీగ్ ఆలోచనలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందంటూ విమర్శలు చేశారు. జూన్ 8 లేదా 9న మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

New Update
TS: కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకం.. కిషన్ రెడ్డి

Kishan reddy: కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకమని బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ముస్లిం లీగ్ ఆలోచనలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం చేవెళ్ల పార్లమెంట్ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో లోక్ సభ ఎన్నికలను ఉద్ధేశిస్తూ మాట్లాడిన ఆయన.. జూన్ 8 లేదా 9న మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రధాని కీలు బొమ్మ..
దేశ భవిష్యత్తు కోసం మోడీకీ ఓటేయాలని పిలపునిచ్చారు. మోడీ రాకముందు దేశంలో మాఫియా రాజ్యమేలిందని, ఇప్పుడ ఆ పరిస్థితి లేదన్నారు. గత ప్రధానిని కీలు బొమ్మగా పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో చైనా వస్తువులు ఇంపోర్ట్ చేసుకునేవాళ్లం. కానీ ఈ రోజు చిన్న పిల్లలా బొమ్మల నుంచి చంద్రమండలానికి వెళ్ళే మేచిన్ వరకు ఇండియాలో తయారు చేస్తున్న ఉత్పత్తులు పెంచి. దిగుమతులు తగ్గించామన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో ప్రతి 15 రోజుల కి ఓ కుంభకోణం జరిగిందని, మోడీ ప్రధానిగా ఉన్న పదేళ్ళలో ఒక్క రూపాయి అవినీతి లేదన్నారు. రాష్ట్రంలో బీఅర్ఎస్ ప్రభుత్వం పోవడానికి పదేళ్లు పట్టింది. కాంగ్రెస్ కు ఐదేళ్లు కూడా పట్టేలా లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: AP: ఆ హంతకుడిని జగన్ కాపాడుతున్నారు.. షర్మిలా ఆరోపణలు!

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ కి డబుల్ డిజిట్ సీట్లు వస్తె 2028 లో తెలంగాణలో బీజేపీ నీ అధికారంలోకి తెచ్చే బాధ్యత నాదని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామంటున్న కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు