CM Revanth: రాష్ట్రంలో కుల గణన జరపాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్..

రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ సర్కార్‌ కేబినేట్ కీలక నిర్ణయాలు తెలుసుకుంది. రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌లకు ఆమోదం.. వాహనాల నెంబర్‌ ప్లేట్‌ TS నుంచి TG గా మార్పు, రాష్ట్రంలో కులగణన చేపట్టడం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

New Update
Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర సచివాలయంలో కాంగ్రెస్ సర్కార్‌ కేబినేట్ భేటీలో కీలక నిర్ణయాలు తెలుసుకుంది. అలాగే ఫిబ్రవరి 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ నిర్వహణకు ఆమోదం తెలిపింది. భేటీ జరిగిన అనంతరం మంత్రులు శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

కేబినేట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే

  •  రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’
  • వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌.. టీజీగా మార్పు
  • రాష్ట్రంలో కులగణన జరపాలని నిర్ణయం
  • తెలంగాణతల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయడం
  • రూ.500 లకు గ్యాస్ సిలిండర్‌కు ఆమోదం
  • 200 యూనిట్ల ఉచిత కరెంట్‌కు ఆమోగం
  • మూతబడ్జ నిజాం షుగర్ కార్మాగారను పునురుద్దిరించేలా నిర్ణయం
  • తెలంగాణ హైకోర్టు కోసం 100 ఎకరాలు కేటాయింపు
  • కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం
  • 65 ఐటీఐ కళాశాలలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్‌డేట్‌ చేయాలని నిర్ణయం
  • సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి.. వాళ్లని విడుదల చేయడం
  • అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం.
  • ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘ చర్చ.
  • 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు