CM Revanth: తెలంగాణ భవిష్యత్తు ప్రభుత్వ టీచర్ల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రభుత్వం సంకల్పం తీసుకుందని, విద్యా వ్యవస్థలో మార్పు అనే యజ్ఞానికి ఉపాధ్యాయులంతా సహకరిస్తారనే విశ్వాసం తనకుందని సీఎం చెప్పారు. దశాబ్దాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా టీచర్లతో ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
పూర్తిగా చదవండి..TG Teachers: గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలి.. టీచర్లకు సీఎం రేవంత్ కీలక సూచనలు!
గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ ప్రభుత్వ టీచర్లకు సూచించారు. తెలంగాణ భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉందని టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు. విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని కోరారు.
Translate this News: