Revanth Reddy Slams KCR in Assembly : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) మధ్య వాటర్ వార్ అంతకంతకూ ముదురుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project) విషయంపై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరినొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచనే కేసీఆర్(KCR) దేనని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని ఇంజనీర్లకు సూచించింది కూడా కేసీఆరేనని మండిపడ్డారు. రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ కమిటీ ఏర్పాటు చేశారని.. ఆ కమిటీ సాగునిటి ప్రాజెక్టులపై ఓ రిపోర్టును ఇచ్చిందన్నారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని ఇంజినీర్లు తేల్చారని.. ఐదుగురు ఇంజినీర్ల బృందం స్పష్టంగా చెప్పిన విషయం ఇదేనన్నారు. గత ప్రభుత్వం ఈ రిపోర్ట్ ను తొక్కి పెట్టిందని ఫైర్ అయ్యారు.
రేవంత్రెడ్డి ఏం అన్నారంటే?
–> గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది.
Revanth Reddy : ఆ ఆలోచనే కేసీఆర్దే.. మేడిగడ్డ విషయంలో తప్పంతా వారిదే : రేవంత్రెడ్డి
గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని ఇంజినీర్లు తేల్చారని.. అయినా కేసీఆర్ వారి మాట వినలేదని మండిపడ్డారు. ఐదుగురు ఇంజినీర్ల బృందం ఇచ్చిన రిపోర్ట్ను బీఆర్ఎస్ తొక్కిపెట్టిందన్నారు.
Translate this News: