Praja Palana Applications: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయ తలపెట్టిన ఆరు గ్యారెంటీల (6 Guarantees Scheme) కోసం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఆరు గ్యారెంటీల కోసం రాష్ర్ట వ్యాప్తంగా కోటికి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ నెలాఖరులోగా డేటా ఎంట్రీ ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే వాటిని పక్కన పెట్టొద్దని అధికారులకు సూచించారు. అవసరమైన వివరాల కోసం దరఖాస్తుదారునికి ఫోన్ చేసి సరైన సమాచారం కనుక్కుని డేటా ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసిన తరువాతే వాటిని ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పూర్తిగా చదవండి..Praja Palana Applications: ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే… రేవంత్ కీలక ఆదేశాలు
అభయాహస్తం ఆరు గ్యారెంటీల అమలు కోసం స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే వాటిని పక్కన పెట్టోద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Translate this News: