Telangana CM Camp Office: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే.. పలు విషయాల్లో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ విషయంలోనూ.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఇవ్వగా.. క్యాంప్ ఆఫీసుకు కొత్త భవనం అవసరం లేదని తన నిర్ణయాన్ని తెలిపారు రేవంత్ రెడ్డి. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం క్యాంప్ ఆఫీస్ విషయాన్ని ప్రస్తావించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లోని ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజాభవన్లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని కూడా ఉపయోగించుకుంటామన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్న ఖాళీ స్థలంలో సీఎం క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: అసెంబ్లీని కూలుస్తారా? సీఎం రేవంత్ సంచలన రిప్లై..!
తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, నూతన అసెంబ్లీ భవనం కడతారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఆడంబరాలకు పోయేది లేదని, కొత్త బిల్లింగ్లు కట్టేది లేదని తేల్చి చెప్పారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ చిన్నగా నిర్మిస్తామని చెప్పారు.
Translate this News: