CM Jagan: ఈ నెల 26న చంద్రబాబు అడ్డాలోకి సీఎం జగన్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో ఈ నెల 26న చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం కెనాల్‌కు నీటిని విడుదల చేయనున్నారు.

Chandrababu: జగన్‌ను దెబ్బకొట్టేలా చంద్రబాబు పర్యటనలు
New Update

CM Jagan: మరికొన్ని నెలల్లో ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారాలను ప్రారంభించాయి. ఏపీలో మరోసారి అధికారాన్ని పొందాలని సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచారు. తాజాగా  ఈ నెల 26న టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం కెనాల్‌కు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం శాంతిపురం మండలంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ALSO READ: ఎమ్మెల్యే ఆర్కే వైసీపీలో చేరడంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

పర్యటన షెడ్యూల్..

ఉదయం 8.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రామకుప్పం మండలం రాజుపేట చేరుకుంటారు, అక్కడ కుప్పం కెనాల్‌కు నీటిని విడుదల చేసిన అనంతరం శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లికి చేరుకుంటారు, అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

చంద్రబాబుపై జగన్ విమర్శలు..

ఒంగోలు లో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల దాడి చేశారు. ఏపీ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు అయినా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన హయాంలో పేదలకు సెంట్‌ స్థలం ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. 

బ్రోకర్లను నమ్ముకున్నాడు..

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారని సెటైర్లు వేశారు సీఎం జగన్. చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదని పేర్కొన్నారు. చంద్రబాబు 650 హామీలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదని అన్నారు. నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ మద్దతు తనకు లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. బాబులా దళారులను, బ్రోకర్లను తాను నమ్ముకోలేదని.. తాను నమ్ముకుంది దేవుడు.. ప్రజల్ని అని అన్నారు సీఎం జగన్. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి అని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

#ap-latest-news #chandrababu #cm-jagan #kuppam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe