Ap: పేదరికం లేని సమాజమే లక్ష్యం..కుప్పం పర్యటనలో చంద్రబాబు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండు రోజుల పర్యటన ముగిసింది.పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు.ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు.గత పాలనకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం అన్నారు.

AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!
New Update

Ap: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండు రోజుల పర్యటన ముగిసింది. రెండో రోజు ఉదయం కుప్పం ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రజల నుంచి వినతులు స్వయంగా స్వీకరించారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు చిత్తూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.

అతిథిగృహం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సచివాలయ ఉద్యోగులకు విధులు కేటాయించారు. వినతిపత్రాలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజల వివరాలు నమోదు చేసుకుని శాఖలవారిగా జాబితా రూపొందించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్న చంద్రబాబు అనంతరం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలుపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు. దీని కోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు. గత పాలనకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం అన్నారు. బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్దమీటింగ్​లు, భారీ కాన్వాయ్​లతో సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు బాబు వివరించారు.

రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి సమగ్ర కార్యప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని అన్నారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని అధికారులకు చంద్రబాబు తెలిపారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తి వేయాలన్నారు.

రౌడీయిజం చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. గత 5 సంవత్సరాలు అధికారులు మనసు చంపుకుని పనిచేశారని, వైఎస్సార్సీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహకరించారన్నారు. తన సొంత నియోజకవర్గానికి రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత ఐదేళ్లలో కల్పించారని తెలిపారు. తనపైనా హత్యాయత్నం కేసు పెట్టారని, 2019 వరకు తనపై ఒక్క కేసు కూడా లేదని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవ్వడంపై తాను చాలా బాధపడ్డానన్నారు. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు తెలిపారు.

Also read: ప్రభాస్ ‘కల్కి’ పై నారా లోకేష్ పోస్ట్.. సంతోషంగా ఉందంటూ!

#politics #ap #tdp #kuppam #cbn
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe