Vijay Antony Maargan: సరికొత్త ప్రయోగం చేస్తున్న విజయ్ ఆంటోనీ.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!

విజయ్ ఆంటోని హీరోగా నటించి స్వయంగా నిర్మించిన పాన్ ఇండియా మూవీ ‘మార్గన్’ జూన్ 27న విడుదలకు సిద్ధమైంది. లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

New Update

Vijay Antony Maargan: విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ ‘మార్గన్’ థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు.

Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!

ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్ తొలిసారి విలన్ పాత్రలో వెండితెరపై పరిచయం కానున్నారు. విజయ్, అజయ్‌ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి.

Also Read: Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే

మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా 'మార్గన్'

'మార్గన్' చిత్రాన్ని ఒక అంతుపట్టని మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథా చిత్రం ఇది. కథలో ఊహించని మలుపులు, సస్పెన్స్‌తో పాటు యాక్షన్‌ ఎలిమెంట్స్‌ను కలగలుపుతూ కొత్త అనుభూతి కలిగేలా తెరకెక్కించారు.

Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!

ఇందులో సముద్రఖని, మహానటి శంకర్, ప్రీతిక, బ్రిగిడా వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజువల్ ప్రెజెంటేషన్ పరంగా సినిమాకు యువ్ ఎస్. కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా, సంగీతం కూడా విజయ్ ఆంటోనినే స్వయంగా అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. థ్రిల్లింగ్ నేర కథలను ఆస్వాదించే ప్రేక్షకులకు ఇది తప్పక చూడాల్సిన చిత్రం అని చెప్పవచ్చు. మార్గన్ విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో  ప్రేక్షకుల్లో ఆసక్తి మెల్లగా పెరుగుతోంది. థియేటర్లలో ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు