/rtv/media/media_files/2025/04/27/YRbzxwr0xBEgwxlRZQ13.jpg)
Vijay Deverakonda Reacts On Pahalgam Terror Attack
BREAKING: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గతంలో 'రెట్రో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గిరిజనులను కించపరిచేలా చేయడంపై గిరిజన సంఘాల నేతలు కేసు పెట్టారు. ఈ మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు ఫెయిల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BIG BREAKING: FIR filed against #VijayDeverakonda under the SC/ST Atrocities Act.
— Narendra News (@Narendra4News) June 22, 2025
The case was registered after several tribal groups raised objections to his remarks made during the Retro pre-release event, alleging that his comments were offensive towards tribal communities. pic.twitter.com/e6haveGU1S
అసలేం జరిగింది...
అయితే రెండు నెలల క్రితం ' రెట్రో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన విజయ్.. తన ప్రసంగంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విమర్శించే క్రమంలో ఆదివాసుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ''500 ఏళ్ల క్రితం గిరిజనులు ఘర్షణ పడినట్లుగా.. టెర్రరిస్టులు దాడులు, విధ్వంసం సృష్టిస్తున్నారు'' అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గిరిజన సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేశారు. గిరిజనులను కించపరిచేలా, అవమానించేలా విజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు.
గతంలో కూడా
ఈ నేపథ్యంలో గిరిజన సంఘం నాయకుడు అశోక్కుమార్ రాథోడ్ ఈరోజు రాయదుర్గం పోలీసులకు విజయ్ పై ఫిర్యాదు చేశారు. వెంటనే అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో లాయర్ కిషన్ చౌహన్ కూడా విజయ్ దేవరకొండపై ఇదే విషయం గురించి ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ప్రసంగంలో ఆదివాసులపై అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారంటూ కిషన్ చౌహాన్ ఫిర్యాదులో తెలిపారు.
Also Read: Viral News: పదిహేనేళ్ల సంసారంలో ఊహించని ట్విస్ట్ ! చంపుతుందనే భయంతో లవర్ తో భార్యకు పెళ్లి!