Allu Aravind ఆడాళ్ళు బొద్దింకలు.. ఎందుకంటే.. వైరలవుతున్న అల్లు అరవింద్ కామెంట్స్

'సింగిల్' ట్రైలర్ లో ''ఆళ్ళు లేడీస్ రా.. అంటే కాక్రోచెస్! అనే డైలాగ్ వాడడం పై నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అణుబాంబులు పేలినా బొద్దింకలు జీవించగలవు.. అలాగే అమ్మాయిలు క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడగలరు అనే ఉద్దేశంతో ఆ డైలాగ్ వాడినట్లు తెలిపారు.

New Update

Allu Aravind అల్లు అరవింద్ గీత ఆర్ట్స్  నిర్మాణంలో  తెరకెక్కిన లేటెస్ట్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్  'సింగిల్'. శ్రీవిష్ణు హీరోగా, కేతిక శర్మ, లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మే 9న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. 

కాక్రోచెస్ డైలాగ్ 

అయితే ట్రైలర్ లో ''ఆళ్ళు లేడీస్ రా.. అంటే కాక్రోచెస్! వాళ్ళు చచ్చిపోరు, మనల్ని చంపేస్తారు'' అనే డైలాగ్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆడవాళ్లను బొద్దింకలతో పోల్చడానికి కారణమేంటి అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దీనిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత అల్లు అరవింద్. 

అందుకే ఆ డైలాగ్ 

అణుబాంబులు పేలినా బొద్దింకలు జీవించగలవని.. అలాగే అమ్మాయిలు క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడగలరు అనే ఉద్దేశంతో సినిమాలో ఈ డైలాగ్ వాడినట్లు అల్లు అరవింద్ తెలిపారు. అలాగే సినిమా చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ తో ఉంటుందని, కడుపుబ్బా నావిస్తుందని చెప్పారు. 

telugu-news | cinema-news | Single movie | allu-aravind

Advertisment
Advertisment
తాజా కథనాలు