/rtv/media/media_files/2025/03/04/JIrGzSbcyTfnaJS5tjGY.jpg)
sai Dharam tej SYD
Sai Durgha Tej: 'విరూపాక్ష' హిట్ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నుంచి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ 'సంబరాల ఏటి గట్టు'. 1947 హిస్టరీ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 65% షూటింగ్ పూర్తిచేసుకుంది.
1000 మంది డాన్సర్లతో
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవలే రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేసిన హై యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ లో భారీ బడ్జెట్ సాంగ్ షూట్ చేస్తున్నారు. అయితే ఈ పాటను 1000 మంది డాన్సర్లతో చిత్రీకరిస్తున్నారట. ఇటీవలి కాలంలో చిత్రీకరించిన హై బడ్జెట్ పాటల్లో ఇదీ ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రమిది.
Also Read: Oscar Awards 2025: జస్ట్ మిస్.. ప్రియాంక చోప్రా 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్!
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ను విడుదల చేయగా.. సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. 'ఏటిగట్టు సాక్షిగా చెబుతుండా.. ఈ సారి నరికానంటే ఈ సారి అరుపు గొంతులోంచి కాదు తెగిన నరాల్లోంచి వస్తుంది' అంటూ గ్లింప్స్ లో తేజ్ చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ఐశ్వర్యలక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.