/rtv/media/media_files/2025/01/21/SadB77Trbr2iNTp5p5lB.jpg)
IT raids dil raju Photograph: (IT raids dil raju)
Tollywood: తెలంగాణను డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని సినీ నిర్మాత దిల్రాజు పిలుపునిచ్చారు. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకున్నవారిపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో విలువైన వ్యాఖ్యలు చేశారు.
ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధరణ అయితే ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తాం. తెలంగాణ ఎఫ్డీసీ, తెలుగు చిత్ర పరిశ్రమ తరపున కోరుకునేది ఒక్కటే. అలాంటిది ఇక్కడ జరిగిందని తెలిస్తే వారిని ఇండస్ట్రీలో అడుగు పెట్టకుండా చేయాలి. అప్పుడే సమాజానికి సందేశం వెళ్తుంది. ఎఫ్డీసీ తరపున చిత్ర పరిశ్రమ పెద్దలతో మాట్లాడి తెలుగు సినిమాలోనూ పాటించేలా చేస్తాం. ఇది మన కర్తవ్యం. డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చడానికి మనమంతా ప్రతిజ్ఞ చేయాలన్నారు.
Also Read: కాల్పుల విరమణ జరిగినా బయటకు రాని ఖమేనీ.. హత్యకు ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ !
ఇక రామ్చరణ్ మాట్లాడుతూ.. ‘మీ వయసులో ఉన్నప్పుడు అవగాహన కార్యక్రమాలకు స్కూల్ తరపున వెళ్లేవాడిని. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గతంలో కొన్ని స్కూల్స్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి బాధేసింది. అప్పు ఈ విషయంలో పోలీస్శాఖ కృషిని ప్రశంసిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారదాం.. డ్రగ్స్ను నిర్మూలిద్దాం' అన్నాడు.
నేనో చిన్న ప్రపంచంలో బతుకుతా. బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు. నేను విశాఖ పోర్ట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ గురించి బైట్ ఇవ్వమని ఓ పోలీస్ ఆఫీసర్ అడిగారు. గౌరవం కొద్దీ ఇచ్చాను. కానీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ డే ఉందని తెలిసిన తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్లను కలిశా. వారు చెప్పిన విషయాలు విని, కచ్చితంగా దీనిపై మాట్లాడాలనిపించింది. దీనిని ఒక బాధ్యతగా తీసుకుంటున్నా. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం అవసరం లేదు. యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు. కొన్ని దేశాలు యువతకు మత్తు అలవాటు చేసి దేశ భవిష్యత్ను నాశనం చేయాలని అనుకుంటున్నారు. డ్రగ్స్ మన జీవితాల్ని నాశనం చేస్తాయి. ఒక్కసారి వాటికి అలవాటు పడితే కోలుకోవడం చాలా కష్టం. మీ స్నేహితులు డ్రగ్స్ అలవాటు చేస్తే వారికి దూరంగా ఉండాలని విజయ్ దేవరకొండ చెప్పారు.