Varsham 4k Re Release: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మళ్ళీ థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!

ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్, డార్లింగ్ కెరీర్‌ను మలుపు తిప్పిన క్లాసిక్ హిట్ ‘వర్షం’ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. 2025 మే 23న 4K వెర్షన్‌ రీ-రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

New Update
Varsham 4k Re Release

Varsham 4k Re Release

Varsham 4k Re Release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులకు మరో శుభవార్త.. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన క్లాసిక్ హిట్ ‘వర్షం’ మళ్లీ వెండితెరపై సందడి చేయబోతోంది. చిత్ర యూనిట్ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2004లో విడుదలైన ఈ సినిమాను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసారు, 2025 మే 23న 4K వెర్షన్‌ రీ-రిలీజ్ చేయనున్నారు.

Also Read: 70 ఏళ్ల అమ్మమ్మ చీరలో ముస్తాబైన హీరోయిన్.. ఎంత అందంగా ఉందో! ఫొటోలు చూస్తే అంతే

ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా కనిపించగా, దర్శకుడు శోభన్ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టారు. అప్పట్లో ప్రభాస్ సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఓ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుండగా, ఈ సినిమా డార్లింగ్ ప్రభాస్ కెరీర్‌కు తిరుగులేని హిట్ ఇచ్చింది. ఒకరకంగా ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టడంలో సూపర్ సక్సెస్ అయ్యింది  'వర్షం' మూవీ.

ఇందులో విలన్ గా నటించిన గోపీచంద్ కూడా తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, ప్రభాస్- గోపీచంద్ మధ్య వచ్చే యాక్షన్ సీన్‌లకు అప్పట్లో థియేటర్లు దద్ధరిల్లిపోయాయి. ఈ సినిమా ప్రభాస్‌ ఫాలోయింగ్‌ను పెంచడమే కాకుండా, ఆయనకు సాలిడ్ బ్లాక్ బాస్టర్ హిట్ ని ఇచ్చింది.

Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

 4K వెర్షన్‌ లో..

ప్రస్తుతం ప్రభాస్ కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా ట్రీట్‌ అని  చెప్పొచ్చు. 4K క్వాలిటీలో మళ్లీ విడుదలవుతున్న ఈ సినిమాతో మళ్ళీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు