Pooja Hegde: లక్షలు పెట్టి నన్ను ట్రోల్ చేయిస్తున్నారు.. నెగటివ్ పీఆర్ గుట్టువిప్పిన పూజ

నటి పూజ హెగ్డే నెగెటివ్ పీఆర్ గురించి సంచలన విషయాలు తెలిపింది. లక్షలు ఖర్చుపెట్టి తనను ట్రోల్ చేయిస్తున్నారని వాపోయింది. తనపై ట్రోలింగ్ చేస్తున్న మీమ్ పేజీలను ఆమె టీమ్ కాంటాక్ట్ అవగా.. ఈ పని చేసేందుకు వారికి లక్షలు ఇస్తున్నట్లు చెప్పారని తెలిపింది.

New Update

Pooja Hegde:  నటి పూజ హెగ్డే ప్రస్తుతం హిందీ, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో దేవా, తమిళ్ లో రెట్రో, జన నాయగన్, కాంచన4 సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా నెగటివ్ పిఆర్ గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ప్రస్తుత వినోద పరిశ్రమలో వేరొక నటీనటులను అప్రతిష్టపాలు చేయడానికి లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తనకు జరిగిన సంఘటన గురించి చెబుతూ.. '' ఓ సందర్భంలో తనపై ట్రోలింగ్ చేస్తున్న మీమ్ పేజీలను ఆమె టీమ్ కాంటాక్ట్ అవగా.. ఈ పని చేసేందుకు వారికి లక్షలు ఇస్తున్నట్లు చెప్పారని తెలిపింది. అలాగే ట్రోలింగ్ ఆపాలంటే తాను కూడా అంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారని'' నెగటివ్ పీఆర్ గుట్టు విప్పింది.

Also Read: SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!

లక్షలు ఖర్చు పెడుతున్నారు.. 

పూజ ఇంకా మాట్లాడుతూ.. నెగెటివ్ పీఆర్ తనపై, తన కుటుంబంపై ఎంతో చెడు ప్రభావం చూపిందని తెలిపింది. ''సోషల్ మీడియాలో ఆ ట్రోల్స్ చూసినప్పుడు నేను , నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డాము.  కానీ నేను దానిని ఒక పొగడ్తగా తీసుకున్నాను. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి చూపించాలని భావిస్తే, మీరు వారి కంటే ఉన్నతంగా ఉన్నారని అనుకునేదాన్నిఅంటూ నెగిటివ్ పీఆర్ కారణంగా తాను ఎదుర్కున్న ఇబ్బందులను తెలిపింది.  

telugu-news | cinema-news | latest-news

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
తాజా కథనాలు