Pooja Hegde: నటి పూజ హెగ్డే ప్రస్తుతం హిందీ, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో దేవా, తమిళ్ లో రెట్రో, జన నాయగన్, కాంచన4 సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా నెగటివ్ పిఆర్ గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ప్రస్తుత వినోద పరిశ్రమలో వేరొక నటీనటులను అప్రతిష్టపాలు చేయడానికి లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తనకు జరిగిన సంఘటన గురించి చెబుతూ.. '' ఓ సందర్భంలో తనపై ట్రోలింగ్ చేస్తున్న మీమ్ పేజీలను ఆమె టీమ్ కాంటాక్ట్ అవగా.. ఈ పని చేసేందుకు వారికి లక్షలు ఇస్తున్నట్లు చెప్పారని తెలిపింది. అలాగే ట్రోలింగ్ ఆపాలంటే తాను కూడా అంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారని'' నెగటివ్ పీఆర్ గుట్టు విప్పింది.
Also Read: SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!
లక్షలు ఖర్చు పెడుతున్నారు..
పూజ ఇంకా మాట్లాడుతూ.. నెగెటివ్ పీఆర్ తనపై, తన కుటుంబంపై ఎంతో చెడు ప్రభావం చూపిందని తెలిపింది. ''సోషల్ మీడియాలో ఆ ట్రోల్స్ చూసినప్పుడు నేను , నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డాము. కానీ నేను దానిని ఒక పొగడ్తగా తీసుకున్నాను. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి చూపించాలని భావిస్తే, మీరు వారి కంటే ఉన్నతంగా ఉన్నారని అనుకునేదాన్నిఅంటూ నెగిటివ్ పీఆర్ కారణంగా తాను ఎదుర్కున్న ఇబ్బందులను తెలిపింది.
telugu-news | cinema-news | latest-news
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్