అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తూన్న కొత్త సినిమా ‘తండేల్’. ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు మేకర్స్ మరో అప్డేట్ అందించారు.
సాంగ్ రిలీజ్
ఈ సినిమా నుంచి తాజాగా లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ‘నమో నమః శివాయ’ అంటూ సాగే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. నాగచైతన్య డ్యాన్స్ అదరగొట్టేశాడు. శివుని పాటకు చైతు వేసిన డ్యాన్స్కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఇక సాయి పల్లవి అయితే ఉగ్రరూపం చూపించిందనే చెప్పాలి. డ్యాన్స్లో తన మార్క్ చూపించింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇకపోతే దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. కార్తికేయ 2 సినిమాతో సౌత్, నార్త్లో రికార్డులు క్రియేట్ చేశాడు. చందూ క్రియేటివిటీకి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్పై పోటీ ఎవరో తెలుసా?
ఇప్పుడు చైతుతో చందు సినిమా అనే సరికి అక్కినేని అభిమానులు, సినీ ప్రియులలో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. గీత ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
రియల్ సంఘటనల ఆధారంగా
శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారుల రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సముద్రంలో వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ బోర్డర్లోకి వెళ్లడం.. అక్కడ పోలీసులకు చిక్కడం.. అక్కడ నుంచి వారు ఎలా బయటపడ్డారు అనే కాన్సెప్ట్తో సినిమా రాబోతుంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.