Meenakshi Chaudhary: ఎక్కువున్నా ఇబ్బందే..! కాలేజీ రోజుల్లో చాలా బాధపడ్డా..

సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తో టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి తన ఎత్తు కారణంగా చిన్నతనంలో ఒంటరితనాన్ని అనుభవించినట్లు తెలిపింది. తండ్రి ప్రోత్సాహంతో ఆ సమస్యను జయించి, వరుస విజయాలతో సినీ రంగంలో వెలుగొందింది.

New Update
Meenakshi Chaudhary

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary: 'ఇచట వాహనములు నిలుపరాదు' అనే చిత్రంతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన మీనాక్షి చౌదరి, తక్కువ సమయంలోనే తనదైన గుర్తింపు తెచ్చుకుంది. డెబ్యూ ఫిల్మ్ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రావడంతో, ఆమె కెరీర్ లో వేగంగా దూసుకెళ్లింది.

రవితేజతో నటించిన ‘ఖిలాడీ’ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా, అడివి శేష్‌తో నటించిన ‘హిట్ 2’ మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తరవాత మహేష్‌బాబు సరసన ‘గుంటూరు కారం’లో మెరిసిన మీనాక్షి, గతేడాది చివర్లో విడుదలైన ‘లక్కీ భాస్కర్’తో మంచి విజయం సాధించింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ అందాల తార వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

Also Read: 70 ఏళ్ల అమ్మమ్మ చీరలో ముస్తాబైన హీరోయిన్.. ఎంత అందంగా ఉందో! ఫొటోలు చూస్తే అంతే

ఎత్తు కారణంగా చాలా బాధ పడ్డా: మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)

ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి తన బాల్యం, కెరీర్ ప్రారంభం లో ఎదుర్కున్న విషయాల గురించి ఓపెన్‌ అయ్యింది. చిన్నప్పుడు అందరితో కలిసి సరదాగా మాట్లాడాలన్నా ఇబ్బందికరంగా ఉండేదని తెలిపింది. కాలేజీ రోజుల్లో ఈ సమస్య మరింత పెరిగిందని, దానికి కారణం తన ఎత్తు అంటూ చెప్పుకొచ్చింది. తన ఎత్తు అప్పట్లోనే 6 అడుగుల 2 అంగుళాలు ఉండటం వల్ల, తోటి స్నేహితులతో పోలిస్తే భిన్నంగా కనిపించేదని తెలిపింది.

ఈ కారణంగా చాలా మంది తన నుండి దూరంగా ఉండేవారని పేర్కొంది. ఇది తనకు ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని, తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఆ విషయాన్ని ఆయనకు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఆమె తండ్రి, "నీ సమస్యను నువ్వే పరిష్కరించాలి" అనడంతో ఆమె చదువుపై ఆసక్తిని పెంచుకొని, పుస్తకాలు చదవడం, అందాల పోటీలలో పాల్గొనడం, సినిమాలలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం ఇలా ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకున్నట్లు తెలిపింది. 

Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

ఇలా మెల్లగా సినీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని బలపర్చుకుంది మీనాక్షి. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా, వాటిని అధిగమించి, మంచి విజయాలను సాధించింది.

ఇక తాజాగా, 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న NC-24 అనే బిగ్గెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో, మీనాక్షి చౌదరి నాగ చైతన్యతో కలిసి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో చైతన్య తొలిసారి ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం హీరో-హీరోయిన్ల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు