Kannappa: ఎట్టకేలకు 'కన్నప్ప'కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్! ఎన్ని కట్స్ చెప్పిందంటే

మంచు విష్ణు 'కన్నప్ప' ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది. 13 సన్నివేశాలు తొలగించిన తర్వాత సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. కట్స్ తర్వాత ఈ సినిమా మొత్తం రన్ టైం 3 గంటల 2 నిమిషాలుగా కుదించారు. 'కన్నప్ప' ఈనెల 27న విడుదల కానుంది.

New Update

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్  'కన్నప్ప' ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈమూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది.   అయితే  13 కట్స్  తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

13 కట్స్ తర్వాత

సెన్సార్ బోర్డు ఆధ్వర్యంలో 11 మంది సభ్యులతో కూడిన రివిజన్ కమిటీ ఈ సినిమాను  వీక్షించిన తర్వాత  13 సన్నివేశాలను తొలగించాలని నివేదిక ఇచ్చింది. ఇందులో బ్రహ్మానందం చెప్పిన కొన్ని డైలాగులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలను తొలగించిన తర్వాతే సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని రీజనల్ సెన్సార్ ఆఫీసర్ స్పష్టం చేశారు. ఈ మేరకు చిత్ర బృదం తగిన మార్పులు చేసింది. ఈ కట్స్ తర్వాత సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది.  కట్స్ తర్వాత ఈ సినిమా మొత్తం రన్ టైం 3 గంటల 2 నిమిషాలుగా కుదించారు. 

Also Read: Nabha Natesh: 'ఇస్మార్ట్ పోరీ' రీబూట్.. అందంతో మళ్ళీ ఆకట్టుకునే ప్రయత్నం!

అభ్యంతరాలు 

అయితే  'కన్నప్ప'  లోని కొన్ని పిలక- గిలక వంటి పాత్రలు బ్రాహ్మణుల సంప్రదాయాలను, సంస్కృతిని కించపరిచేలా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వివాదాల నేపథ్యంలో సెన్సార్ బోర్డు పలు మార్పులు చెప్పినట్లు సమాచారం.  ఇదిలా ఉంటే.. బుధవారం నుంచి  'కన్నప్ప' ప్రీ బుకింగ్  సేల్స్ మొదలవుతాయని హీరో మంచు విష్ణు ఎక్స్ వేదికగా తెలిపారు.

బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ , మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర  దాదాపు 30 నిమిషాల నిడివి ఉంటుందని సమాచారం. 

Also Read: Chiranjeevi: యంగ్ ప్రొడ్యూసర్ తో మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. 'కుబేరా' ఈవెంట్ లో అదిరే అప్డేట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు