Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈమూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే 13 కట్స్ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
13 కట్స్ తర్వాత
సెన్సార్ బోర్డు ఆధ్వర్యంలో 11 మంది సభ్యులతో కూడిన రివిజన్ కమిటీ ఈ సినిమాను వీక్షించిన తర్వాత 13 సన్నివేశాలను తొలగించాలని నివేదిక ఇచ్చింది. ఇందులో బ్రహ్మానందం చెప్పిన కొన్ని డైలాగులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలను తొలగించిన తర్వాతే సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తామని రీజనల్ సెన్సార్ ఆఫీసర్ స్పష్టం చేశారు. ఈ మేరకు చిత్ర బృదం తగిన మార్పులు చేసింది. ఈ కట్స్ తర్వాత సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. కట్స్ తర్వాత ఈ సినిమా మొత్తం రన్ టైం 3 గంటల 2 నిమిషాలుగా కుదించారు.
Also Read: Nabha Natesh: 'ఇస్మార్ట్ పోరీ' రీబూట్.. అందంతో మళ్ళీ ఆకట్టుకునే ప్రయత్నం!
అభ్యంతరాలు
అయితే 'కన్నప్ప' లోని కొన్ని పిలక- గిలక వంటి పాత్రలు బ్రాహ్మణుల సంప్రదాయాలను, సంస్కృతిని కించపరిచేలా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వివాదాల నేపథ్యంలో సెన్సార్ బోర్డు పలు మార్పులు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. బుధవారం నుంచి 'కన్నప్ప' ప్రీ బుకింగ్ సేల్స్ మొదలవుతాయని హీరో మంచు విష్ణు ఎక్స్ వేదికగా తెలిపారు.
బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ , మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర దాదాపు 30 నిమిషాల నిడివి ఉంటుందని సమాచారం.
Also Read: Chiranjeevi: యంగ్ ప్రొడ్యూసర్ తో మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. 'కుబేరా' ఈవెంట్ లో అదిరే అప్డేట్!