Chiranjeevi: యంగ్ ప్రొడ్యూసర్ తో మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. 'కుబేరా' ఈవెంట్ లో అదిరే అప్డేట్!

'కుబేరా' సక్సెస్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ జాన్వీ నారంగ్ తో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆమె ఇప్పటికే ప్రియదర్శి హీరోగా 'ప్రేమంటే' అనే మూవీ నిర్మిస్తున్నారు.

New Update
Chiranjeevi intresting update on next project

Chiranjeevi intresting update on next project

Chiranjeevi: హీరో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'కుబేరా' సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన అప్డేట్ పంచుకున్నారు. త్వరలో యువ నిర్మాత జాన్వీ నారంగ్‌తో కలిసి ఒక కొత్త సినిమా అనౌన్స్ చేయనున్నట్లు  ప్రకటించారు.   ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని సమాచారం. 

జాన్వీ నారంగ్ ఎవరు?

జాన్వీ నారంగ్ ఓ ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చారు. దివంగత ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ మనవరాలు జాన్వీ నారంగ్. ఆమె ఇప్పటికే ప్రియదర్శి హీరోగా 'ప్రేమంటే' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. దీనికి రానా దగ్గుబాటి కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ తన వయసుతో సంబంధం లేకుండా కొత్త దర్శకులను, నిర్మాతలను ప్రోత్సహిస్తూ, అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ ప్రకటనతో స్పష్టం అవుతోంది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌గా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే  'దసరా' ఫేమ్ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో యాక్షన్ థ్రిల్లర్ కి సిద్ధమవుతున్నారు. వీటితో పాటు భారీ బడ్జెట్ తో రూపొందిన సోషియో ఫాంటసీ  'విశ్వంభర' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం  VFX పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. 

Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు