Bhairavam: 'భైరవం' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ రోజు థియేటర్స్ లో సందడే!

మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన 'భైరవం' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update

Bhairavam: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోల కాంబోలో రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా  'భైరవం'. గత నెల 24న విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాల చేత వాయిదా పడింది. ఈ క్రమంలో తాజాగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. మనోజ్, నారా రోహిత్, శ్రీనివాస్ సంబరాలు చేసుకుంటూ ఉన్న ఈ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ''ఈ వేసవిలో, మరెక్కడా లేని సినిమా అనుభవానికి సిద్ధంగా ఉండండి'' అంటూ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. 

చాలా గ్యాప్ తర్వాత.. 

విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మించారు. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది ఇందులో హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురి మధ్య స్నేహం, భావోద్వేగం, యాక్షన్  అంశాలతో టీజర్ ఆసక్తికరంగా కనిపించింది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. చాలా గ్యాప్ తర్వాత  మంచు మనోజ్ నుంచి రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

telugu-news | cinema-news | latest-news | Bhairavam release date

Also Read: JVAS Re Release: మానవా.. కొత్తగా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రీ రిలీజ్ ట్రైలర్.! భలే ఉంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు