Lakshmi Manchu: మంచు లక్ష్మి విడాకులు.. తండ్రి దగ్గరకు వెళ్లిపోయిన కూతురు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

నటి మంచు లక్ష్మీ భర్తతో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా దీనిపై లక్ష్మి స్పందించారు. వైవాహిక జీవితంలో తాము ఎంతో అన్యోన్యంగ ఉంటామని.. ప్రస్తుతం తాను తన భర్తతోనే ఉన్నానని తెలిపింది.

New Update
Lakshmi Manchu

Lakshmi Manchu

Lakshmi Manchu: టాలీవుడ్ లో మరో సెలెబ్రెటీ విడాకుల వార్త తెరపైకి వచ్చాయి. మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే లక్ష్మీ..  ఏదైనా ఈవెంట్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో  ఎక్కువగా తన కూతురితో మాత్రమే కనిపిస్తుంటారు. భర్త ఆండీ శ్రీనివాస్‌తో ఎప్పుడూ పెద్దగా కనిపించరు. దీంతో మంచు లక్ష్మి భర్తకు దూరంగా ఉంటున్నారని, భర్తతో విడాకులు తీసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

 Also Read: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

మంచు లక్ష్మీ విడాకులు 

అయితే తాజాగా దీనిపై మంచు లక్ష్మీ రియాక్ట్ అయ్యారు. తన భర్త విదేశాల్లో ఐటీ ప్రొఫెషనల్ గా పని చేస్తున్నారని, వైవాహిక జీవితంలో తాము ఎంతో అన్యోన్యంగానే ఉంటామని తెలిపారు. మా ఇద్దరికీ బాధ్యతలు ఉన్నాయి. ప్రస్తుతం నేను నా భర్తతో ఉన్నాను. మాకు ఎలా అనిపిస్తే అలా బ్రతుకుతాము. జనాలు ఏమనుకుంటారో, ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉండలేమని తెలిపారు. తన కూతురు ప్రస్తుతం తన భర్త దగ్గరే ఉందని చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

మంచు లక్ష్మీ 2006లో ఆండీ శ్రీనివాస్ ని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప ఉంది. లక్ష్మీ 2011లో టాలీవుడ్ లో తన సినీ కెరీర్ మొదలు పెట్టింది. అనగనగ ఓ ధీరుడు, దొంగాట, గుండెల్లో గోదారి, చందమామ కథలు వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలతో పలు సెలెబ్రెటీ టాక్ షోలు కూడా నిర్వహించింది లక్ష్మీ. 

Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tourist Family: ఓటీటీలోకి రాజమౌళి ఫేవరేట్ సినిమా .. స్ట్రీమింగ్ డేట్ ఇదే

శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. రాజమౌళి సైతం మూవీపై ప్రశంసలు కురిపించారు.

New Update

Tourist Family: శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. రాజమౌళి సైతం మూవీపై ప్రశంసలు కురిపించారు. డెబ్యూ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఇందులో యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, బక్స్, ఎలాంగో కుమారవేల్, శ్రీజా రవి కీలక పాత్రలు పోషించారు. 

మూవీ స్టోరీ 

శ్రీలంకలో ఆర్థిక పతనం,  COVID సంక్షోభం తర్వాత తమిళనాడుకు అక్రమంగా వలస వెళ్ళిన ధర్మదాస్ (శశికుమార్), అతని భార్య (సిమ్రాన్), వారి ఇద్దరు కుమారుల నేపథ్యంలో సాగే  కుటుంబం కథ ఇది. వారు కొత్త జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నించే క్రమంలో ఆ కుటుంబం ఎదుర్కున్న సవాళ్లు ఈ చిత్రంలో చూపించారు. 

latest-news | cinema-news | telugu-cinema-news

Also Read: This Week Ott: స్టార్ హీరోల సినిమాలతో సందడే సందడి.. ఈ వారం ఓటీటీ సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment