/rtv/media/media_files/2025/03/05/rWH0COdfvs3oPg4tRfUa.jpg)
సాక్రెడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ తో నటిగా మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ కుబ్రా సైత్. ఇటీవలే షాహిద్కపూర్ హీరోగా నటించిన దేవా మూవీతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. గతంలో తాను అండమాన్ ట్రిప్కు వెళ్లినప్పుడు అక్కడ ఓ ఫ్రెండ్తో కలవడం వల్ల గర్భం దాల్చినట్లుగా వెల్లడించింది. భయపడి ఒంటరిగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నట్లుగా కుబ్రా చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని కొన్నేళ్ల వరకు అది ఎవరికీ చెప్పలేదన్న ఈ బ్యూటీ.. ఈ విషయాలన్ని తన బయోగ్రఫీ ఓపెన్ బుక్ లో పొందుపర్చినట్లు వెల్లడించింది. తాను అబార్షన్కు వెళ్లినప్పుడు బలంగా ఉన్నట్లు అనిపించలేదని బలహీనంగా ఉన్నానని.. ఒక దశలో తాను బ్రతుకుతానని చెప్పే ధైర్యం, శక్తి తనకు లేవంది. ఓ సారి ఓసారి తన ఫ్రెండ్ తో కలిసి ట్రిప్కు వెళ్లినప్పుడు ఈ విషయం గురించి చర్చించానని తెలిపింది. ఆ సమయంలో తన కళ్లలో నీళ్లు వచ్చాయని వెల్లడించింది.
ఆ పాత్రలో నటించడంలేదు..
బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న రామాయణ సినిమాలో శూర్పణఖ పాత్ర కోసం కుబ్రా సైట్ ను ఎంపిక చేసినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా కుబ్రా దీనిపై క్లారిటీ ఇచ్చారు. శూర్పణఖ పాత్ర కోసం తాను ఆడిషన్ ఇచ్చానని .. కానీ ఎంపిక కాలేదని చెప్పింది. కుబ్రా ఇంకా సరదాగా మాట్లాడుతూ.. నా ముక్కు కారణంగా నేను శూర్పణఖ సరిగ్గా సరిపోతానని అనుకున్నాను. కానీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ పాత్రను ఎవరికి ఇచ్చారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది అని తెలిపారు. కాగా బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మైథలాజికల్ డ్రామా 'రామాయణ'. ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు పార్టులుగా రానుంది. 2026 దీపావళి కానుకగా మొదటి భాగం, 2027 దీపావళికి సెకండ్ పార్ట్ విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇందులో రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా.. సీత పాత్రలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది.
Also read : Telangana Inter Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు!