లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ కు హీరో కార్తీ క్షమాపణలు, ట్వీట్ వైరల్

తిరుమల లడ్డూ వివాదంపై హీరో కార్తీ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హీరో కార్తీ.. పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించమని కోరారు.

New Update
karthi pawan

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంపై కోలీవుడ్ హీరో కార్తీ నిన్న 'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ గురించి ఫన్ కామెంట్స్ చేయడం సరికాదు. 

లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అంటూ కార్తీ కామెడీ చేశారు. అలా అనడం కరెక్ట్ కాదు. కార్తీ చేసిన కామెంట్స్ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి. మరో సారి అలా అనొద్దు.. నటుడిగా కార్తీ అంటే  నాకు చాలా గౌరవం.. కానీ లడ్డూ విషయంలో చేసిన కామెంట్స్ సరికాదు అని సూచించారు. అయితే దీనిపై హీరో కార్తీ.. పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

' డియర్ పవన్ కళ్యాణ్ సర్.. మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది. నావల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించండి. ఆ వెంకటేశ్వర స్వామికి అపార భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను'  అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో కార్తీ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read : లడ్డూ మీద జోకులా..! కార్తీ పై పవన్ ఆగ్రహం..!

లడ్డూ గురించి కార్తీ ఏమన్నారంటే..

'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ కార్తినీ లడ్డూ కావాలా నాయనా అని  ఫన్నీగా అడిగింది. దానికి కార్తీ.. లడ్డూ టాపిక్ వద్దు.. ఇప్పుడు అది చాలా సున్నితమైన టాపిక్ అంటూ సెటైరికల్ గా బదులిచ్చాడు. దీంతో ఈ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు.

పవన్ ప్రత్యేక దీక్ష..

శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ గుడి మెట్లను శుభ్రపరిచి అమ్మవారికి సేవ చేసుకున్నారు. అనంతరం మీడియా ముందు లడ్డూ వివాదం గురించి మాట్లాడారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు