Kiara Advani : గుడ్‌ న్యూస్‌ చెప్పిన కియారా అద్వానీ .. తల్లి కాబోతున్నట్లు ప్రకటన

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023లో పెళ్లి చేసుకున్నారు.

New Update
kiara advani good news

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ  గుడ్‌ న్యూస్‌ చెప్పింది.  తాను తల్లిని  కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ సెలబ్రేటీలు అభినందనలు తెలుపుతున్నారు.  

రెండు సంవత్సరాల తర్వాత

కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7వ తేదీన  జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకున్నారు. వివాహం అయిన రెండు సంవత్సరాల తర్వాత, ఈ జంట తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్నారు.  ప్రస్తుతం కియారా త్వరలో రణవీర్ సింగ్ తో కలిసి డాన్ 3 లో కనిపించనుంది. మరోవైపు, సిద్ధార్థ్ ప్రస్తుతం పరమ్ సుందరి షూటింగ్ లో ఉన్నాడు. తెలుగులో భరత్ అను నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో కియారా నటించింది.  

Also Read :  Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

Advertisment
తాజా కథనాలు