Kantara Chapter 1: 'కాంతార చాప్టర్ 1' టికెట్ రేట్ల పెంపు కు లైన్ క్లియర్..

రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన 'కాంతారా చాప్టర్ 1' అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కానుంది. తెలుగు వర్షన్‌కి ఏపీలో టికెట్ ధరలు రూ.50 పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ 28న జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరవ్వనున్నారు.

New Update
Kantara Chapter 1

Kantara Chapter 1

Kantara Chapter 1: సెన్సేషనల్ హిట్ కాంతారాకి ప్రిక్వెల్‌గా తెరకెక్కుతున్న 'కాంతారా చాప్టర్ 1' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రిషబ్ శెట్టి(Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో,  హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2, 2025న పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది.

Kantara Chapter 1 Tickets Price Hike

తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండటంతో, తెలుగు వెర్షన్‌కు భారీ విడుదలను ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకి టికెట్ ధరలు రూ. 50 పెరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

ఈ సినిమాలో రుక్మిణి వసంత కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే జయరాం, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ థుమినాడ్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

కథ విషయానికి వస్తే,

ఇది గ్రామీణ నేపథ్యం, దేవతల తత్వం, మరియు ఫోక్ కల్చర్‌ను మిళితం చేసిన పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. సినిమా సెన్సార్ పూర్తయ్యి U/A 16+ సర్టిఫికేట్ను పొందింది. రన్‌టైమ్ సుమారు 168 నిమిషాలు.

Also Read:‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..

సెప్టెంబర్ 28న హైదరాబాద్ JRC కన్వెన్షన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. దర్శకుడు రిషబ్ శెట్టి ఎన్టీఆర్‌కు పెద్ద అభిమాని కావడం వల్ల ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎన్టీఆర్ హాజరుతో ఈ ఈవెంట్‌కు మరింత హైప్ ఏర్పడనుంది.

Advertisment
తాజా కథనాలు