Kannappa: బిగ్ ట్విస్ట్.. 'కన్నప్ప' ప్రొడ్యూసర్ కి పోలీస్ నోటీసులు!

మంచు విష్ణు 'కన్నప్ప' హార్డ్ డిస్క్ మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. హార్డ్ డిస్క్ చోరీపై ఫిర్యాదు చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు.

New Update

Kannappa: Kannappa:  మంచు విష్ణు  'కన్నప్ప' హార్డ్ డిస్క్ మిస్ అవడంతో టీమ్ అంతా ఫుల్ టెన్షన్ లో ఉంది. ఇప్పటికే కన్నప్ప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌ హార్డ్ డిస్క్ చోరీపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

నిర్మాతకు నోటీసులు 

ఈ క్రమంలో తాజాగా హార్డ్ డిస్క్ మిస్సింగ్ కేసు మరో కొత్త మలుపు తిరిగింది. దర్యాప్తులో భాగంగా ఫిర్యాదుదారైన విజయ్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు.  రెండు రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట ఆధారాలతో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిర్మాతను కూడా చోరీ దర్యాప్తులో భాగంగా విచారించడం ప్రస్తుతం  హాట్ టాపిక్ గా మారింది. 

అసలేం జరిగింది

కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్‌ ట్వంటీ ఫోర్‌ ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. కాగా  కన్నప్ప చిత్రానికి కీలకమైన కంటెంట్‌ ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను ముంబైకి చెందిన వీఎఫ్‌ఎక్స్‌ విక్రేతల్లో ఒకరు (హైవ్‌ స్టూడియోస్‌) డీటీడీసీ కొరియర్‌  ద్వారా ఫిలింనగర్‌లోని ట్వంటీ ఫోర్‌ ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయానికి పంపించారు. కాగా డెలివరీ రికార్డుల ప్రకారం పార్శిల్‌ ఈ నెల 25న కార్యాలయానికి చేరుకుంది. డీటీడీసీ కొరియర్‌ వచ్చిన సమయంలో ఆఫీస్‌బాయ్‌ రఘు దాన్ని అందుకున్నాడు. అయితే అతను దాన్ని చరిత అనే మహిళకు అప్పగించాడు.

కాగా హార్డ్‌ డ్రైవ్‌ వచ్చిన విషయం తెలుసుకున్న కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్‌డ్రైవ్‌ విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్లు చెప్పాడు. అయితే చరిత హార్డ్‌డ్రైవ్‌ తీసుకున్నప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, చరిత, రఘులు కావాలనే కొంతమంది ప్రమేయంతో తమ  సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా తిరుగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఎన్నిసార్లు వారిని సంప్రదించిన లాభం లేకపోవడంతో ట్వంటీ ఫోర్‌ ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రెడ్డి విజయ్‌కుమార్‌ ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు