/rtv/media/media_files/2025/04/15/ivNqMjQasLAOvgns4P0B.jpg)
NTR- Kalyan Ram
NTR- Kalyan Ram: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ పై అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘వార్ 2’లో బిజీగా ఉండగా, మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టులపై కూడా అభిమానుల్లో ఆసక్తి భారీగా పెరిగింది.
Also Read: వాళ్లను అస్సలు పట్టించుకోను.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసిన మౌనీ రాయ్
ఇప్పటికే ఎన్టీఆర్ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెల్సన్ ‘జైలర్ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్తో సినిమా ప్రారంభించనున్నట్లు టాక్ నడుస్తోంది.
Also Read: అజిత్ ఎనర్జీ చూసి షాకయ్యా: సునీల్
‘దేవర’ సీక్వెల్ పై క్లారిటీ..
అయితే ఎన్టీఆర్ మరోసారి తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘దేవర’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ‘దేవర 2’ తప్పకుండా ఉంటుందనీ, ‘డ్రాగన్’ పూర్తయ్యాక వెంటనే సెట్స్పైకి వెళ్తుందనీ తారక్ ఆల్రెడీ ఓ వేదిక పై చెప్పిన సంగతి తెలిసిందే, తాజాగా ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసారు. కళ్యాణ్ రామ్ దేవర సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడం విశేషం.
Also Read: రెమ్యునరేషన్కు లింగ భేదం ఏంటీ..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా
ఇక దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులను పక్కన పెట్టి పూర్తిగా ‘దేవర 2’ స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా 2025లో సెట్స్పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
Also Read: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!
ఇక నెల్సన్- ఎన్టీఆర్ మూవీ విషయానికి వస్తే, దానికి కనీసం 2027 వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి తారక్ అభిమానులు తమ అభిమాన హీరో నుండి వరుస బిగ్ బడ్జెట్ సినిమాలు రానుండడంతో పండగ చేసుకుంటున్నారు.