BIG BREAKING: కాచీగూడలో కన్నీరు పెట్టించే ఘటన.. ట్రైన్ ఢీకొని అన్నదమ్ముల మృతి!

హైదరాబాద్ . కాచీగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను మహ్మద్‌ సాహెబుద్దీన్‌ (26), ఫైజాన్‌ (21) గా గుర్తించారు.

New Update
kachiguda railway station incident

kachiguda railway station incident

BIG BREAKING:  రైలు పట్టాలపై దాటాడం ప్రమాదకరం అని ఎందుకు చెబుతారో ఈ ఘటనతో మరో సారి రుజువైంది. ఇద్దరుఅన్నదమ్ములు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ కాచిగూడ సమీపంలో చోటుచేసుకుంది.  

ఇద్దరు అన్నదమ్ముళ్లు

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్‌ సాహెబుద్దీన్‌ , ఫైజాన్‌ అనే అన్నదమ్ములు సోమవారం కాచిగూడ సమీపంలోని యాకుత్‌పురా-ఉప్పుగూడ స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా అటుగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సాహెబుద్దీన్‌ ఎలక్ట్రిక్ పనులు చేస్తుండగా.. ఫైజాన్‌ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. కొడుకుల అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు