Sardar Ji 3 Controversy: పంజాబీ ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ లేటెస్ట్ మూవీ 'సర్దార్ జీ 3' వివాదాలను చుట్టుముట్టింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. అయితే ఈ సినిమాలో పాకిస్థానీ నటి హానియా అమీర్ నటించడమే ఈ వివాదానికి దారి తీసింది.
ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారతదేశంలో పాకిస్థానీ నటీనటులను బ్యాన్ చేయాలంటూ విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో సినిమాలో పాకిస్థానీ నటిని తీసుకోవడంపై 'సర్దార్ జీ 3' తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సినిమాను బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మేకర్స్ ఈ సినిమాను ఇండియాలో విడుదల చేయడంలేదని ప్రకటించారు. భారత ప్రజల మనోభావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
40% ఆదాయం పోయినట్లే!
అయితే తాజాగా దీనిపై నిర్మాతలు మరోసారి స్పందించారు. భారతదేశంలో సినిమాను విడుదల చేయకపోవడం వల్ల 40% ఆదాయం కోల్పోతామని తెలిపారు. గతంలో తాము నిర్మించిన 'జాట్ అండ్ జూలియట్ 3' సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయగా.. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను వచ్చాయని.. అందులో 40 శాతంకు పైగా ఆదాయం ఇండియా నుంచే వచ్చిందని చెప్పారు. ఆ రకంగా చూస్తే ఇప్పుడు తాము ఆ 40 శాతం ఆదాయాన్ని కోల్పోయినట్లే అని అన్నారు. అయినప్పటికీ తాను పాకిస్థాన్ నటులను, భవిష్యత్తులో వారితో ప్రాజెక్టులు చేయమని వెల్లడించారు.
దిల్జిత్ పై విమర్శలు
ఇప్పటికే హీరో దిల్జిత్, సినిమా నిర్మాతలు ఈ వివాదంపై స్పందించారు. 'సర్దార్ జీ 3' సినిమా షూటింగ్ ప్రస్తుత ఉద్రిక్తతలు మొదలవడానికి ముందే, చిత్రీకరించామని తెలిపారు. అప్పటి పరిస్థితులు వేరని.. అందుకే హానియా అమీర్ ని తీసుకున్నామని వెల్లడించారు. ఇదిలా ఉంటే దిల్జిత్ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ, విదేశాల్లో విడుదల చేయడానికి ముందుకు రావడంపై నెటిజన్లు ఆయన దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు.